PCB To Re-appoint Babar Azam As Captain: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ టోర్నీ తర్వాత కెప్టెన్సీ నుంచి బాబర్ అజామ్ ఉద్వాసన పలికారు. ఇప్పుడు బాబర్ కే మళ్లీ పాక్ జట్టు కెప్టెన్గా నియమితులయ్యే అవకాశం ఉందంటున్నారు.
బాబర్ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత వన్డే జట్టు కెప్టెన్సీ షాహీన్ షా అఫ్రిదీకి పీసీబీ అప్పగించింది టెస్టు జట్టు కెప్టెన్గా షాన్ మసూద్ ను నియమించింది. ఈ ఇద్దరు వైఫల్యాన్ని చూసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యూ టర్న్ తీసుకుందని తెలుస్తోంది.
వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ తర్వాత.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో 0-3, T20 సిరీస్లో 1-4 తేడాతో పాకిస్థాన్ ఓడిపోయింది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టుకు నాయకత్వం వహించేందుకు బాబర్ అజామ్ సరిపోతాడని పీసీబీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Read More: ఐసీసీ ర్యాంకింగ్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత..
పాకిస్థాన్ జట్టులోని ఆటగాళ్లు ఫిబ్రవరి 17 నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడనున్నారు. వారు ఇంగ్లాండ్తో 4మ్యాచ్ల T-20 సిరీస్ను ఆడతారు. జూన్లో T20 ప్రపంచ కప్ ఉంది. ఈ నేపథ్యంలోనే బాబర్ అజామ్ కే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారని ముందునుంచే వార్తలు వస్తున్నాయి.