AP Assembly live updates(Political news in AP): నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. బడ్జెట్ పై మంత్రి బుగ్గన మాట్లాడటం ప్రారంభించగానే.. టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆయన స్పీచ్ కు అడ్డుతగిలారు. అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే.. స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీని టీ బ్రేక్ కు వాయిదా వేశారు.
Read Also : AP Assembly Sessions 2024 : నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తారా ?
అసెంబ్లీ ప్రారంభమవ్వగానే.. టీడీపీ సభ్యులు జాబ్ క్యాలెండర్ పై వాయిదా తీర్మానం ఇవ్వగా.. దానిని యథావిధిగానే స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టూ చేరి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యపాన నిషేధం, దిశ చట్టం ఎక్కడున్నాయని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రాన్ని.. గంజాయి రాష్ట్రంగా మార్చాడని ఆరోపించారు. అందుకు బదులుగా టీడీపీ వాళ్లే రాష్ట్రంలో గంజాయిని వ్యాప్తి చేస్తున్నారని మంత్రి బుగ్గన విమర్శించారు. నినాదాలు, ఆందోళనల మధ్య ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది.
టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వడం, దానిని స్పీకర్ తిరస్కరించడం, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసిన సభ్యులను సస్పెండ్ చేయడం. మూడు రోజులుగా ఏపీ అసెంబ్లీలో ఇదే పరిస్థితి నెలకొంది.