Virat Kohli going to Miss 3rd & 4th Test against England: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్తో జరిగిన తొలి రెండు టెస్టులకు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దూరమైన సంగతి తెలిసిందే. మిగిలిన మూడు టెస్టులకు జట్టుకు కోహ్లీ సేవలు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇండియా – ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు రాజ్కోట్లో మూడో టెస్టు ప్రారంభం కానుంది.
తదుపరి టెస్టులు ఆడతాడా లేదా అని కోహ్లీ బీసీసీఐకి సమాచారం ఇవ్వలేదని తెలిసింది. కోహ్లి భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అందుకే కోహ్లీ తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లండన్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి 27 వరకు రాంచీలో, చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాలలో జరగనున్నాయి.