EPAPER

Ayodhya: అయోధ్యలో KFC.. కానీ కండిషన్స్ అప్లై..!

Ayodhya: అయోధ్యలో KFC.. కానీ కండిషన్స్ అప్లై..!

Food Outlets Conditions in Ayodhya: అయోధ్యకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. తొలి 12 రోజుల్లోనే దాదపు 25 లక్షల మందిని భవ్య రామమందిరాన్ని సందర్శించుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. నవమి వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి వరకు వారానికి 10-12 లక్షల మంది అయోధ్యకు తరలివస్తారని అంచనా.


ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లోనూ, చుట్టుపక్కల ఫుడ్ అవుట్ లెట్లు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ చెయన్స్ డొమినోస్, పిజ్జా హట్ బిజినెస్ ఇప్పటికే ఇబ్బడిముబ్బడైంది. అయోధ్య-లఖ్‌నవూ హైవేపై ఉన్న కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) అవుట్‌లెట్‌ను కూడా ఆలయ పరిసరాల్లో అనుమతించనున్నారు. అయితే కండిషన్స్ అప్లై. వెజిటేరియన్ ఆహార పదార్థాలను మాత్రమే ఆ సంస్థ అందించాల్సి ఉంటుంది.

అయోధ్య ఆలయ పరిసరాల్లోని పంచ కోసి మార్గ్‌లో మాంసం, మద్యం విక్రయాలు నిషిద్ధం. పంచ కోసి పరిక్రమ అనేది అయోధ్య చుట్టూ ఉన్న 15 కిలోమీ టర్ల పవిత్రమైన తీర్థయాత్ర సర్క్యూట్. అందుకే పంచ్ కోసి మార్గ్ లోపల శాకాహార వంటకాలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీనికి వెలుపల మాత్రమే మాంసాహారం అందించే అవుట్ లెట్లను ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.


Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×