Asaduddin Owaisi’s speech on UCC(Telugu breaking news): ఉత్తరాఖండ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్ ( యూసీసీ)ని పూర్తిగా హిందూ కోడ్ అని ఎంఐఎం అద్యక్షుడు, ఎంపీ అసదుద్దీన ఒవైసీ అభివర్ణించారు. ఢిల్లీలో ఆయన యూసీసీపై స్పందిస్తూ హిందువుల కోడ్ అయిన ఉమ్మడి పౌరసత్వాన్ని ముస్లింలపై, ఇతర మతాల వాళ్లపై వర్తింపజేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. కోడ్లో హిందూ అవిభక్త ఫ్యామిలీ(హెచ్యూఎఫ్)ను ఎందుకు ముట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు.
ఇతర మతాల వాళ్ల సంప్రదాయాలను ముస్లింలు ఆచరించాలని చట్టంలో పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు తమ మతాచారాలను ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నప్పుడు గిరిజనులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నపుడు అక్కడి సీఎం పుష్కర్ సింగ్ యూసీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అసదుద్దీన్ విమర్శలు గుప్పించారు. వరదలు వచ్చి రాష్ట్ర ప్రజలు చాలా సమస్యల్లో ఉంటే పుష్కర్ సింగ్కు యూసీసీ ఎందుకు ప్రాధాన్యత కలిగిన అంశంగా కనిపిస్తోందో చెప్పాలని ఓవైసీ డిమాండ్ చేశారు.