TS High Court : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుల దర్యాప్తుపై కొనసాగుతున్న స్టేను ఎత్తివేత వేసింది. నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించవచ్చని పేర్కొంది.
ఈ కేసులో బీజేపీ వేసిన పిటిషన్ కు అర్హత ఉందని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో ఉండగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని న్యాయవాది తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేయాలన్న బీజేపీ పిటిషన్ పై ఈ నెల 18న వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో అపిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరింది. వాదనలు విన్న హైకోర్టు నవంబర్ 18కి విచారణను వాయిదా వేసింది.