U-19 World Cup IND vs SA Semi-Final Updates : అండర్ -19 వరల్డ్ కప్ తొలి సెమీస్ ఫైనల్ భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన యువ టీమిండియా.. సఫారీ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆదిలోనే సౌతాఫ్రికా జట్టు ఓపెనర్ స్టీవ్ స్టాక్ (14) వికెట్ ను కోల్పోయింది. ఆ జట్టు స్కోర్ 23 పరుగుల వద్ద స్టాక్ .. లింబాని బౌలంగ్ లో కీపర్ ఆరవెల్లి అవినాష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాసేపటికే డేవిడ్ టీగెర్ (0) ను లింబానీ బౌల్డ్ చేశాడు.
లింబానీ దూకుడుతో సఫారీ జట్టు 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ లూన్ డ్రి ప్రిటోరియస్ నినాదనంగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 30.2 ఓవర్ వద్ద జట్టు సఫారీ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన ప్రిటోరియస్ ముషీర్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 118.
రిచర్డ్ సెలెట్ స్వేన్, ఒలివర్ వైట్ హెడ్ నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ ను 150 పరుగులు దాటించారు. అయితే ఓలివర్ (22) ను ముషీర్ ఖాన్ అవుట్ చేయడంతో 40 ఓవర్ చివరి బంతికి నాలుగో వికెట్ కోల్పోయింది సఫారీ జట్టు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 163/4. డెవాన్ మెరయిస్ (3) ను సౌమీ పాండే పెవిలియన్ కు పంపడంతో సౌతాఫ్రికా జట్టు 174 పరుగుల వద్ద 5 వికెట్ కోల్పోయింది.
మరోవైపు రిచర్డ్ హాఫ్ సెంచరీ (64)తో పోరాటం చేశాడు. కెప్టెన్ జాన్ జేమ్స్ (24) , ట్రిస్టన్ లూస్ ( (23) దాటి ఆడి జట్టు స్కోరును పెంచారు. నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. భారత్ కు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
లక్ష్య ఛేదనలో టీమిండియా యువ బ్యాటర్ల తడబడ్డారు. 32 పరుగలకే నాలుగు వికెట్లు పడ్డాయి. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (0), అర్షిన్ కులకర్ణి (12), ముషీర్ ఖాన్ (4), ప్రియాన్షు మోలియా (5) వెంటవెంటనే అవుట్ అయ్యారు.