Shakeel Son Case Hyderabad(Telangana news): పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత షకీల్పై కూడా లుక్ అవుట్ నోటీస్ జారీ అయింది. యాక్సిడెంట్ కేసులో తన కుమారుడు రాహిల్ను తప్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కుమారుడి కలిసి దుబాయ్కి పారిపోయారు. తండ్రీకొడుకులక సహకరించిన పంజాగుట్ట, బోధన్ సీఐలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదయ్యారు. ఇంకా ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
గతంలో షకీల్ కుమారుడిపై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పంజాగుట్టలో ర్యాష్ డ్రైవింగ్ చేసిన తొలుత ముంబైకి పారిపోయాడు. అక్కడి నుంచి దుబాయికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. రాహిల్ ను రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
డిసెంబర్ 23నే బేగంపేట ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం జరిగింది. రాహిల్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. అతడు ముగ్గురు యువతులను కారులో ఎక్కించుకున్నాడు విచారణలో తేలింది. అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టాడని నిర్ధారించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించారని నిర్ధారణ కావడంతో పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో సాగుతోంది.