AP Assembly Sessions 2024 : ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. శాసన సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందంటూ విపక్ష ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ప్రజలపై పన్నుల భారం మోపి వారి నడ్డి విరుస్తున్నారని నినాదాలు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు విరమించాలని కోరారు. అయినా సరే టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలు కొనసాగించారు. దీంతో ఒకరోజుపాటు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు.
కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవాని, ఏలూరి సాంబశివరావు, గణబాబు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, గద్దె రామ్మోహన్ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ అయ్యారు.