ola fellowship program (latest today news) :
ఐఐటీ బాంబేలోని కృత్రిమ మేధ(AI) పరిశోధకులకు టెక్నాలజీ ఫెలోషిప్లను అందించాలని ఓలా నిర్ణయించింది. భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఇటీవలే స్పేస్ ఏఐలోకి అడుగిడింది. ప్రపంచాన్ని ఊపేస్తున్న ఏఐ సాంకేతికతలో భారత్ ఎంతో వెనుకబడి ఉందని, ఈ రంగంలో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఓలా టెక్నాలజీ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ఆరంభించామని ఓలా వ్యవస్థాపకుడు, చైర్మన్ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఆయన ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి కూడా.
ఏఐ ప్రతిభావంతులకు ప్రస్తుతం దేశంలోనూ, విదేశాల్లోనూ ఎంతో డిమాండ్ ఉంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నిష్ణాతులు, టాలెంట్కు తీవ్ర కొరత ఉంది. భవిష్ అగర్వాల్ కొత్త కంపెనీ కృత్రిమ్ యూనికార్న్ స్థాయికి ఎదిగింది. 50 మిలియన్ డాలర్ల ఫండింగ్ను దక్కించుకోగలిగింది. ఆ కంపెనీ తన తొలి లార్జ్ లాంగ్వేజి మోడల్(LLM) కృత్రిమ్ను 2023 డిసెంబర్లో ఆవిష్కరించింది.