Hyderabad drugs news(Telangana news updates): డ్రగ్స్ కేసుల్లో అటు నిందితులు, ఇటు బాధితుల్లో… ఎక్కువ మంది యువతులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో కొద్దిరోజుల్లోనే డ్రగ్స్ కేసుల్లో ఏకంగా 9 మంది యువతులు పట్టుబడ్డారు.ఇటీవలే లావణ్య అనే యువతి హెరాయిన్తో నార్సింగి పోలీసులకు దొరికిపోయింది.
ఇప్పుడు మరో ఇద్దరు యువతులు డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కారు. మిథున, కొనగాల ప్రియ అనే యువతులు ఇప్పుడు గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్నారు. డ్రగ్స్కు బానిసై, పెడ్లర్ టార్చర్ తట్టుకోలేక మరో యువతి పోలీసులను ఆశ్రయించింది.
రాజేంద్రనగర్లో అనురాధ, సంతోష్ నగర్లో ఆయేషా ఫిర్దౌస్, బోయిన్పల్లిలో మాన్షి కూడా డ్రగ్స్ కేసుల్లో పోలీసులకు చిక్కారు. ఇక న్యూ ఇయర్ సమయంలో సాప్ట్వేర్ ఇంజినీర్ సంధ్య డ్రగ్స్తో పోలీసులకు దొరికిపోయింది. నిజామాబాద్ ఆల్ఫ్రాజోలం అమ్ముతున్న సావిత్రి అనే యువతిని పోలీసులు పట్టుకున్నారు. ఇటీవలి కాలంలో డ్రగ్స్ కేసుల్లో ఎక్కువ మంది యువతులు పట్టుబడుతుండటంతో… పోలీసులే విస్తుపోతున్నారు.