Panjagutta CI Arrest(Hyderabad latest news): పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ చేసిన రోడ్డు ప్రమాద ఘటనలో.. మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. రాహిల్ను తప్పించేందుకు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దుర్గారావును విధుల నుంచి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.
ఇప్పుడు దుర్గారావుని గుంతకల్లు రైల్వే స్టేషన్లో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే దుర్గారావు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు దుర్గారావు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు కేసులో A11గా ఉన్నారు. గత వారం నుంచి పరారీలో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తీసుకొచ్చారు. వెస్ట్జోన్ డీసీపీ కార్యాలయంలో దుర్గారావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు.