Chandrababu-Pawan: సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ ఈ మేరకు టీడీపీ అధినేతతో దాదాపు 3గంటల పాటు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో ఇరువురికి దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం.
రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ ప్రకటించారు. జనసేన పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి బరిలో ఉండేత అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైనా చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోనే చంద్రబాబు, పవన్ లు మకాం వేశారు. ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనన్నట్లు సమాచారం.