Kondapi Assembly constituency : ఏపీలో మంత్రి ఆదిమూలపు సురేష్, కొండపి నియోజక వర్గం ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Kondapi Assembly constituency : ఏపీలో మంత్రి ఆదిమూలపు సురేష్, కొండపి నియోజక వర్గం ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మండిపడుతూ కౌంటర్ ఎటాక్లు చేస్తున్నారు. విద్యాశాఖమంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఒక్క డిగ్రీ కాలేజీ కూడా ఇవ్వలేనందుకు నిజంగానే చెత్త వ్యక్తి అంటూ కొండేపి ఎమ్మెల్యే స్వామి విమర్శించారు.
వెలిగొండకు నీళ్లు ఇస్తానని మోసం చేశారని వైసీపీపై ఎమ్మెల్యే స్వామి మండిపడ్డారు. యర్రగొండపాలెంను అభివృద్ధి చేస్తానని ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను ఎక్కడ నిలదీస్తారనే భయంతో పారిపోయిన వ్యక్తి ఆదిమూలపు సురేష్ అంటూ విమర్శించారు. అటు ఎమ్మెల్యే స్వామి విమర్శలకు ఘాటుగా కౌంటరిచ్చారు ఆదిమూలపు సురేష్. ఓటమి భయం పట్టుకునే స్వామి ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. పిట్టకొంచెం కూతగణం అన్నతీరుగా గొంతేసుకుని అరిస్తే ఎవరూ భయపడేవారి ఇక్కడ లేరని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో చెత్త ఎవరనేది వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్.