Hage Geingob : నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (Hage Geingob) (82) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం దేశ రాజధాని అయిన విండ్ హెక్ లోని లేడీ పోహంబా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఇటీవలే హేజ్ గింగోబ్ కు క్యాన్సర్ నిర్థారణ అవ్వగా.. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లినట్లు వార్తలొచ్చాయి. అంతలోనే ఆయన చనిపోయారన్న వార్త.. ఆ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
2015 లో హేజ్ గింగోబ్ నమీబియా అధ్యక్షుడిగా ఎన్నికై.. దీర్ఘకాలంపాటు దేశాన్ని పాలించారు. ఆయన మృతితో అంగోలో ముంబా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. త్వరలోనే కేబినెట్ భేటీ నిర్వహించి.. తదుపరి కార్యాచరణపై ప్రకటన చేస్తామని అంగోలో ముంబా తెలిపారు. హేజ్ గింగోబ్ మృతి దేశానికి తీరని లోటని తెలిపారు. నవంబరులో అక్కడ అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.