Gang Rape in Bihar(Telugu breaking news):
సాయంత్రం స్కూల్ తర్వాత ట్యూషన్ సెంటర్కు వెళ్తున్న ఓ మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన బీహార్లోని గయా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఇంటి నుంచి ట్యూషన్కు వెళుతుండగా.. దారిలో ఒక దుండగుడు అడ్డగించాడు.
అక్కడి నుంచి ఆ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లాడు. కొంత సమయం తర్వాత అక్కడికి మరో ఇద్దరు యవకులు వచ్చారు. ముగ్గురూ కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిలో ఒకరు అక్కడి నుంచి పారిపోగా.. మరో ఇద్దరు యువకులు బాధితురాలిపై మరోసారి అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘోరం జరిగిన తర్వాత బాలిక ఎలాగోలా ఇంటికి చేరుకుంది. తనపై జరిగిన అత్యాచారం గురించి బాధితురాలు ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తండ్రి సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.