EPAPER

Ktr : ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : ఆ సమస్యను  వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌లో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యపై కేటీఆర్‌ తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. విద్యార్థుల ఆందోళనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్‌ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్‌ అన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని నిజాం కాలేజ్‌ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.


హాస్టల్‌ వసతి అంశంపై ఇటీవల బషీర్‌బాగ్‌ కూడలిలో విద్యార్థులు ధర్నాకు దిగారు. కాలేజ్‌లో ప్రిన్సిపల్‌ ఛాంబర్‌లోనూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ సమస్యను పరిష్కరించాలని అటు విద్యాశాఖ మంత్రిని, ఇటు ప్రిన్సిపల్ ను ఆదేశించారు.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×