RK Roja At Tirumala(Andhra news updates):
తిరుమలలో మంత్రి రోజాకు ఊహించని నిరసన ఎదురైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆమెకు రాజధాని సెగ తగలింది. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా ముందు.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు.
మంత్రి రోజా కూడా జై అమరావతి అంటూ నినదించాలని వారు డిమాండ్ చేశారు. అలా చెప్పడం నచ్చని మంత్రి.. శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
.
.