ఎమ్మెల్సీలుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్లో కొత్త ఎమ్మెల్సీలు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, పార్టీ సీనియర్ నేత విహెచ్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష కార్యదర్శి శ్రీకాంత్ శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు.
గతంలో ఎమ్మెల్సీలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీవారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీంతో రెండుస్థానాలు కాంగ్రెస్ దక్కాయి. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని బరిలోకి దించలేదు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.