బడ్జెట్లో ఆదాయపన్ను వర్గాలకు ఊరట లభించలేదు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును దేశాభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు.
కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకూ ఎలాంటి పన్నులేదన్నారు. స్టాండర్డ్ డిడెక్షన్ రూ.50 వేల నుంచి 75వేలకు పెంచామన్నారు. ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం అంచనాగా పేర్కొన్నారు. ఫిజికల్ డెఫిసిటీ 5.2 శాతానికి తగ్గించామని తెలిపారు.
ఎఫ్డీఐ అంటే ఫస్ట్ డెవలప్ ఇండియాగా నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. ఎఫ్డీఐ పెట్టుబడులు పెరిగాయని వెల్లడించారు. పెట్టుబడులకు ఇది స్వర్ణయుగంగా పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తామన్నారు. స్కరణలు అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు.
ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. దాదాపు గంటపాటు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొననసాగింది.