ఎన్నో అంచనాలతో మరికాసేపట్లో లోక్సభ ముందుకు మధ్యంతర బడ్జెట్ 2024-25 రానున్న వేళ.. స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ రోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ తొలి గంటలోనే క్రమంగా పుంజుకుంటోంది.
ఉదయం 9.30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోగా, వెంటనే పుంజుకుని లాభాల్లోకి దూసుకొచ్చాయి. ఉదయం పదిన్నర సమయానికి సెన్సెక్స్ 219 పాయింట్ల లాభం, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.
బీఎస్ఈ ఇండెక్స్లో అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ రిలయన్స్, హిందూస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి, పవర్ గ్రిడ్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, టీసీఎస్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, లాభాల్లో కొనసాగుతున్నాయి.
మరోవైపు ఎల్ అండ్ టీ, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ భారీగా పతనం అయ్యాయి. ఇదిలా ఉండగా, జనవరి 31 నాటికి జీఎస్టీ వసూళ్లు 10.4 శాతం పెరిగి రూ.1.72 లక్షలు కోట్లు దాటటం విశేషం.