CM Revanth Reddy : సినిమా అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. నంది అవార్డులు పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారన్నారు. నంది పురస్కారాల స్థానంలో ‘గద్దర్’ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. గద్దర
CM Revanth Reddy news today(Telangana news live):
సినిమా అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. నంది అవార్డులు పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారన్నారు. నంది పురస్కారాల స్థానంలో ‘గద్దర్’ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. గద్దరన్న పేరుతో కళాకారులకు పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో జారీ చేస్తామని సీఎం పేర్కొన్నారు.
గద్దర్ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకున్నారని సీఎం రేవంత్ అన్నారు. గద్దర్ తో మాట్లాడితే వెయ్యి ఏనుగుల బలం వచ్చేదన్నారు. గద్దర్ పోరాట పటిమతో గత ప్రభుత్వంపై పోరాటం చేశారన్నారు. ప్రజా ప్రభుత్వ రాకతోనే ప్రజాపాలన మొదలయ్యిందన్నారు.