Hemant Soren : స్వయంగా ముఖ్యమంత్రే ఈడీ అధికారులపై పోలీసు కేసు పెట్టారు. ఈ ఘటన ఝార్ఖండ్లో చోటుచేసుకుంది. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటికి వచ్చి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ తరుణంలో ఝార్ఖండ్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఈ క్రమంలో ఈడీ అధికారులపై సీఎం సోరెన్ పోలీసు కేసు పెట్టడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఈ ఫిర్యాదు పేర్కొన్నారు.
Hemant Soren : స్వయంగా ముఖ్యమంత్రే ఈడీ అధికారులపై పోలీసు కేసు పెట్టారు. ఈ ఘటన ఝార్ఖండ్లో చోటుచేసుకుంది. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటికి వచ్చి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ తరుణంలో ఝార్ఖండ్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఈ క్రమంలో ఈడీ అధికారులపై సీఎం సోరెన్ పోలీసు కేసు పెట్టడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం భారీ భద్రత నడుమ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకుంది. 10 రోజుల వ్యవధిలో రెండోసారి ఆయన్ను దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. అనంతరం సీఎం అరెస్టవుతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో హెమంత్ సోరెన్ భేటీ కాగా ఝార్ఖండ్ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి.
సీఎం హేమంత్ సతీమణి కల్పనా సోరెన్కు సీఎం పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాజ్భవన్, సీఎం నివాసం, ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు.