Hemant Soren : మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారన చేపడుతుంది. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని ఆయన అధికారిక నివాసం దగ్గరకి ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఈడీ భావించింది. విచారణ చేపడుతున్న సమయంలో అదనపు భద్రత కల్పించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
ED investigating Hemant Soren(current news from India) : మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారన చేపడుతుంది. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని ఆయన అధికారిక నివాసం దగ్గరకి ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఈడీ భావించింది.
హెమంత్ సోరెన్ ను విచారణ చేపడుతున్న సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఈడీ డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఝార్ఖండ్ ప్రభుత్వానికి ముందస్తుగానే లేఖ రాసినట్లు తెలిసింది. ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే సోరెన్ అధికార నివాసంతో పాటు రాజ్భవన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించినట్లు సమాచారం. దాదాపు 7 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. పర్యవేక్షణ కోసం ముగ్గురు ఉన్నతాధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు.