EPAPER

Raids In Rice Mills : కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం దుర్వినియోగం .. రైస్‌ మిల్లుల్లో రైడ్స్..

Raids In Rice Mills : కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం దుర్వినియోగం .. రైస్‌ మిల్లుల్లో రైడ్స్..
Today news in telangana

Raids In Rice Mills(Today news in telangana):

నిజామాబాద్‌ జిల్లాలో రైస్‌ మిల్లులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం దుర్వినియోగం అయిందన్న ఆరోపణలపై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తనిఖీలకు ఆదేశించింది. దీంతో జిల్లాలోని పలు రైస్‌ మిల్లుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 9 మిల్లుల యజమానులు ధాన్యం అమ్మేసినట్టు గుర్తించారు.


నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 కోట్ల విలువైన 2.44 లక్షల క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టినట్టు అధికారులు గుర్తించారు. ఖరీప్ లో 4 శాతం, రబీలో 60 శాతానికి పైగా కస్టమ్ మిల్లింగ్ ధాన్యం బకాయిలు పడ్డ మిల్లర్‌ యజమానులపై చర్యలకు సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలోనే 9 మిల్లుల యాజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద నోటీసులు జారీ చేసింది. 9 రైస్ మిల్లుల యజమానుల ఆస్తుల జప్తునకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో నోటీసులు ఇచ్చింది.

local news in telangana

రైస్‌ మిల్లుల్లో ధాన్యం కుంభకోణం జరిగిందని రైత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు .ఇదే విషయంపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


nizamabad news today

Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×