Police Transfers : హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మొత్తాన్నీ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్ లో ఉన్న ఎస్సైలు, కానిస్టేబుల్స్, హోం గార్డులు.. మొత్తం 85 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ అటాచ్ చేశారు. 2018లో దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ గా పేరు తెచ్చుకున్న పంజాగుట్ట పీఎస్ లో కీలకమైన సమాచారాలు లీక్ అవుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వివరించారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు.. పలు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఒకేసారి సిబ్బంది మొత్తంపై బదిలీ వేటు పడింది. నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది 82 మందిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులకు నియమిస్తున్నట్లు సీపీ తెలిపారు.
.
.