social media talk: గత వారం చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఆయన సాధించిన విజయానికి అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో చిరంజీవి సాధించిన ఘనత చూసి మరికొందరు తెలుగేతర దక్షిణాది స్టార్లు ఆయనపై అసూయపడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
దక్షిణాది ప్రముఖులైన రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్లాల్ సహా ఇతర నటులు పద్మవిభూషణ్ ప్రదానం చేసిన చిరుకి శుభాకాంక్షలు చెప్పకపోవడమే దీనికి ప్రధాన కారణం. మమ్ముట్టి మాత్రమే చిరుకి అభినందనలు తెలిపారు. దీంతో రజినీ, కమల్, ఇతరులు చిరు ఫీట్ని చూసి అసూయపడుతున్నారని.. అందుకే చిరును అభినందిస్తూ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా చేయలేదని కొందరు గుస గుసలాడుకుంటున్నారు. అయితే ఇందులో కూడా కొంతమంది నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేస్తుంటే మరికొందరు నెగెటివ్గా రియాక్ట్ అవుతున్నారు.
చిరు చారిత్రాత్మక ఫీట్ని అంగీకరించడానికి ఈ నటులు చాలా అహంభావంతో ఉన్నారని కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం.. బహుశా చిరుకు వ్యక్తిగతంగా విష్ చేసి ఉండవచ్చని అంటున్నారు. అందువల్ల సోషల్ మీడియా పోస్ట్లను షేర్ చేయనందుకు వారిని ట్రోల్ చేయడం సరైన పద్దతి కాదని అంటూన్నారు.