మాజీమంత్రి వివేకా హత్య కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా APCC చీఫ్ YS షర్మిలతో.. వివేక కుమార్తె సునీత భేటీ కావటంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం నెలకొంది. ఓ దశలో సునీత కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తెరపైకి వివేకా రెండో భార్య షమీమ్ రావటంతో.. ఉత్కంఠ నెలకొంది.
వివేకా హత్య తర్వాత కొడుకుతో కలిసి షమీమ్.. అజ్ఞాతంలో ఉన్నారు. అటు మీడియాకు.. ఇటు కుటుంబీలకు దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో షమీమ్.. YS సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. సునీత రాజకీయ ప్రవేశం చేస్తుందన్న సమయంలో.. షమీమ్ ను తెరపైకి తీసుకురావడంతో సునీత ఇరకాటంలో పడే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. వివేకా ఆస్తిలో తన కుమారుడికి వాటా కావాలంటూ షమీమ్ డిమాండ్ చేస్తున్నారు. హత్య కేసులో తెలంగాణ కోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ను.. షమీమ్ దాఖలు చేయనున్నారు.
ఇన్నాళ్లూ సైలెంట్గా ఉన్న షమీమ్.. ఒక్కసారిగా ట్విస్ట్ ఇవ్వటం వెనుక రాజకీయ ప్రోద్భలం ఉందా ? లేక కొడుకు భవిష్యత్ కోసం ఆమె పోరాటం చేయనున్నారా ? అనేది ఉత్కంఠగా మారింది.
.
.