EPAPER

AP Congress : ఏపీలో కాంగ్రెస్ దూకుడు.. నేడు మేనిఫెస్టో కమిటీ భేటీ..

AP Congress : ఏపీలో కాంగ్రెస్ దూకుడు.. నేడు మేనిఫెస్టో కమిటీ భేటీ..
AP Congress News

AP Congress News(AP politics):

ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేగంగా అడుగులు వేస్తోంది. ఇవాళ ఆంధ్రరత్న భవన్ లో మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించనుంది. పల్లంరాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. అన్ని పార్టీల కంటే ముందుగా మేనిఫెస్టో ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. ప్రత్యేకహోదా, విభజన హామీలు, సీపీఎస్ రద్దు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేతతో పాటు పలు సంక్షేమ పథకాలను మేనిఫేస్టోలో పెట్టేలా సూచనలు కమిటీ చేయనుంది.


మరోవైపు.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు కలిశాయి. తమ సమస్యలను వివరిస్తూ మేనిఫెస్టోలో అంశాలను పెట్టాలని కోరారు. తెలంగాణ తరహాలో గ్యారెంటీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కమిటీ నివేదకను షర్మిల పరిశీలించనున్నారు. మార్పులు చేర్పుల అనంతరం ఏఐసీసీకి మేనిఫెస్టో నివేదక అందజేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే మేనిఫెస్టో ఫైనల్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ చేత మేనిఫెస్టో, హమీలపై ప్రకటన చేయించాలని ఏపీసీసీ నేతలు భావిస్తున్నారు.

AP Congress, Apcc chief Ys Sharmila, Congress manifesto committee,


Related News

AP CM Warning: ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. అందులో వేలు పెట్టారో.. ఒప్పుకోనంటూ హెచ్చరిక

YS Sharmila: ఆర్టీసీ బస్సెక్కిన వైయస్ షర్మిళ.. కండక్టర్ కు ప్రశ్నల వర్షం.. అంత మాట అనేశారేంటి ?

Tension In YCP Leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. పొంతన లేని సమాధానాలు, సీఐడీకి ఇచ్చే ఛాన్స్

AP Govt on BigTV News: మద్యం ప్రియుల డిమాండ్స్‌తో ‘బిగ్ టీవీ’ కథనం.. కిక్కిచ్చే న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Rain Alert: బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

Duvvada Srinivas Madhuri: అమ్మో దువ్వాడ.. మాధురి.. ఇంత స్కెచ్ వేశారా.. అంతా ప్లాన్ ప్రకారమేనా?

Ram Mohan Naidu: 3 రోజుల్లో 30 కి పైగా బెదిరింపులు.. విమానయాన శాఖ అలర్ట్.. ఇంతకు బెదిరింపులకు పాల్పడింది ఎవరంటే ?

Big Stories

×