తెలుగు చలనచిత్ర పరిశ్రమ టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం మరోసారి కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా.. ఎక్కడో ఒకచోట అది బయటపడుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకే.. అధికారులు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
తాజాగా.. నార్సింగిలో ఇద్దరు నిందితులను తాజాగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు మహిళ కాగా, మరొకరు పురుషుడు. ట్విస్ట్ ఏమిటంటే.. ఆ మహిళ.. ఒక హీరో ప్రియురాలిగా అని సమాచారం. పక్కా సమాచారంతో పోలీసులు.. నార్సింగిలో లావణ్య, ఉనీత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. లావణ్య హ్యాండ్ బ్యాగ్లో ఈ డ్రగ్స్ లభ్యమైంది.
టాలీవుడ్ హీరో ప్రియురాలైన లావణ్య.. సంగీతం టీచర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తనకు ఉనీత్ రెడ్డి డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చినట్లు లావణ్య తెలిపింది. కాగా ఆ డ్రగ్స్ని కొన్ని రోజుల క్రితమే ఆమె ఉనీత్ నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఆ సమాచారంతోనే లావణ్యని.. SOT పోలీసులు తనిఖీ చేయగా హ్యాండ్బ్యాగ్లో ప్యాకెట్లు దొరికాయి. ఈ ఇద్దరిపై ఎన్డీపీఎస్ 22బీ, రెడ్ విత్ 8సీ కింద పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను రిమాండ్కి తరలించారు.
తాజాగా బయటపడిన ఈ విషయంలో ఇంకా ఎవరిప్రమేయం అయినా ఉందా.. దీని వెనుకున్న బలమైన శక్తులున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.