Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి సంచలన వ్యాఖలు చేశారు. దేశంలో మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవన్నారు. పుతిన్ లాగే మోడీ కూడా దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటాడని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి కీలక వ్యాఖలు చేశారు. దేశంలో మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవన్నారు. పుతిన్ లాగే మోడీ కూడా దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటాడని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశంలో నియంతృత్వం వస్తుందని ఖర్గే అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వాన్ని అరికడతామన్నారు. ఇందుకు ప్రజలు ఇండియా కూటమి కి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
భారత దేశాన్ని ఏకం చేయడానికి రాహుల్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారని ఖర్గే అన్నారు. కాని బీజేపీ నాయకులు మాత్రం ‘నఫ్రత్కీ దుకాన్’కు తెరతీశాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకులకు ప్రతి ఒక్కరికి బీజేపీ ప్రభుత్వం ఈడీ అధికారులతో కలిసి నోటీసులు జారీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.