Manisha Rani: ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ అతి తక్కువ కాలంలోనే ఎంతటి ప్రేక్షకాదరణ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లో కూడా ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన ఎంతో మంది కంటెస్టెంట్లు ఇండస్ట్రీలో తమ టాలెంటెతో దూసుకుపోయారు. అందులో మనీషా రాణి ఒకరు.
హిందీలో బ్లాక్ బస్టర్గా నిలిచిన బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్లో ఈమె కంటెస్టెంట్గా చేసి.. ఎంతోమంది ప్రజలకు చేరువ అయింది. ఈ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ఈమెకు మంచి అవకాశాలు వచ్చాయి. పలు టీవీ ఛానెల్స్లో రియాల్టీ షోస్లో పాల్గొనే అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె సెలబ్రెటీస్ డ్యాన్స్ రియాలిటీ షో.. ఝలక్ దిఖ్లాజా సీజన్ 11లో కంటెస్టెంట్గా చేస్తుంది.
ఈ షోలో తాజాగా ఆమెకు తీవ్ర గాయమైంది. ఒక డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న సమయంలో అదుపుతప్పి క్రింద పడిపోయింది. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం ఏమి లేదని డాక్టర్లు చెప్పుకొచ్చారు.