Bihar NDA government : నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి సీఎం అయిన వెంటనే తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు మొదలు పెట్టారు. బిహార్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అవద్ చౌదరిని తొలిగించాలని కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అవద్ చౌదరి ఆర్జేడీ నేత కావడంతో.. స్పీకర్ ఉన్న ఆయన సాయంతో లాలూ టీం ఇబ్బంది పెడుతుందని ముందు జాగ్రత్తగా నోటీసులు ఇచ్చారు.
మహాఘట్ బంధన్ నుంచి బయటకు వచ్చిన జేడీయూ.. మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరి నిన్న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఈ కూటమిపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నో రోజులు కొనసాదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. తర్వాత రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ కూటమి పార్టీలు కలిసి వెళ్లవని అన్నారు.
గతంలో తాను చెప్పిందే నిజమైందని.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఆయన చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరూ ఊహించన మార్పులు బిహార్ రాజకీయాల్లో చూస్తారని పీకే తెలిపారు. పీకే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.