Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళాశంకర్’ ఎన్నో అంచనాల నడుమ విడుదలై.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఈ సినిమా తర్వాత చిరు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే లక్ష్యంతో క్రియేటివ్ కథలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ‘బింబిసార’ ఫేం వశిష్టతో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు.
యువి క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా తాను ఫిబ్రవరి 1 నుండి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నట్టుగా చిరంజీవి తెలిపారు. సుమారు రెండు వారాలపాటు ఈ షూటింగ్లో చిరు పాల్గొంటారని సమాచారం. తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను దాదాపు రూ.18 కోట్లకు సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. ఇది చిరంజీవి కెరీర్లోనే రికార్డ్ ప్రైస్ అని చెప్పాలి. ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్ను మేకర్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.