Rashmika: అలనాటి హీరోయిన్ సౌందర్య అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు.. విజయాలను అందుకున్నారు.
ఆమె కెరీర్ మంచి స్థాయిలో ఉంది అనే సమయంలో మరణించారు. హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. అయితే ఆమె బయోపిక్లో నటించాలని చాలా మంది హీరోయిన్లకు ఆసక్తి ఉంటుంది. అలాంటి కథ తమ వద్దకు వస్తే కచ్చితంగా చేస్తామని రెడీగా ఉన్నారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ఒకరు.
అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హూదా సంపాదించుకున్న నటీమణులలో రష్మిక ఒకరు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈమూవీ మంచి హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూడలేదు. స్టార్ హీరోల సరసన నటించి నేషనల్ క్రష్గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ హీరోయిన్ తాజాగా కీలక ప్రకటన చేశారు. దివంగత హీరోయిన్ సౌందర్య బయోపిక్లో నటించాలని ఉందని తెలిపారు. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఎవరైనా ఛాన్స్ ఇస్తే సౌందర్య బయోపిక్లో నటిస్తానని వెల్లడించారు.