Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి బోల్తాపడ్డ కారును గుర్తు తెలియని లారీ ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. అలానే మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతులు విజయవాడకు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన మహేశ్(35), జ్యోతి (30), ఇషిక (8), మచ్చేందర్(38), లియాన్స్(2) గా గుర్తించారు.