Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా.. సంపద సృష్టికర్తలుగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైటెక్స్లో జరుగుతున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమం రెండో రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా.. సంపద సృష్టికర్తలుగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైటెక్స్లో జరుగుతున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమం రెండో రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేశ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. సంక్షేమం అమలు చేయాలంటే సంపద కావాలన్నారు. సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే.. ప్రజల అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవని భట్టి వ్యాఖ్యానించారు. సంపద సృష్టించే వారి మనసులను గాయపరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
నిర్మాణ రంగ సంస్థలు బ్యాంకు గ్యారంటీ రుణాలు తెచ్చుకొని పెట్టుబడి పెట్టిన తర్వాత సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని భట్టి పేర్కొన్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది తెలంగాణకు వచ్చి ఇక్కడ స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి వచ్చి సంపద సృష్టించే వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.