IND vs ENG First Test : ఉప్పల్ టెస్ట్ రసవత్తరంగా మారింది. ఓలీ పోప్ ఒంటరి పోరాటంతో ఇంగ్లాండ్ భారత్కు 231 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఓవర్ స్కోర్ 316/6 తో 4 రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 104 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. అద్భుతంగా ఆడిన పోప్ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. 196 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 420 పరుగుల వద్ద ముగిసింది.
ఒక దశలో 7 వికెట్ల నష్టానికి 419 పరుగులతో ఉన్న ఇంగ్లాండ్ ఒక పరుగు వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోయింది. బుమ్రా ఓలీ పోప్ ను బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ముగించాడు.
భారత్ బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీసి భళా అనిపించాడు. అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా జడేజాకు రెండు వికెట్లు, అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కాయి.