Galla Jayadev : టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. పదవిలో ఉంటే తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే వెల్లడించారు.ఈ భావనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులపై మౌనంగా ఉండలేనని అన్నారు. అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.
గత పదేళ్లుగా గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉన్నారు. వరుసుగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2014 , 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్ లో తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. నేరుగా మిస్టర్ పీఎం అంటూ నేరుగా ప్రధాని మోదీని ఏపీ హక్కలపై ప్రశ్నించారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వే జోన్ ఇలాంటి కీలక అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. ఆ సమయంలో ఆయన స్పీచ్ కు పార్టీలకు అతీతంగా ప్రశంసలు వచ్చాయి.