Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజూమున వేగంగా దూసుకెళ్లిన కారు సిమెంట్ లోడ్తో వెళ్తోన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన తెన్కాసి జిల్లాలో చోటు చేసుకుంది.
తెన్కాసి జిల్లా పులియంగుడికి చెందిన ఆరుగురు స్నేహితులు నిన్న రాత్రి కారులో కుర్దాలం వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో పులియంగుడి సమీపంలోని పున్నయ్యపురం వద్ద వీరి కారును ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కార్తీక్, వేల్ మనోజ్ పులియంగుడికి చెందిన పోతిరాజ్, సుబ్రమణ్యం, మనో సుబ్రమణ్యం ప్రమాదంలో మృతి చెందినట్లుగా గుర్తించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తెన్కాసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.