Tirumala : కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నిన్న 76 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు . ఈరోజు కంపార్ట్మెంట్ లు అన్నీ నిండిపోయి ఉన్నాయి. క్యూలైన్ల లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల పాటు పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
మరోవైపు నడక మార్గంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. నిన్న శ్రీవారి పాదాల వద్ద 5000 టోకెన్లు గాను 3000 టోకెన్లు ఇచ్చారంటూ భక్తులు ఆందోళన కూడా చేసిన నేపథ్యం కనిపిస్తోంది. రిపబ్లిక్ డే తో పాటు శని, ఆదివారాలు వరుసగా రావడంతో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగిందని ఆలయ అధికారులు అంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తుల కోసం అన్నప్రసాదాలు నిరంతరం సరఫరా చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.