EPAPER

CM Revanth Reddy : కాళేశ్వరంపై నిపుణుల కమిటీ.. నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష..

CM Revanth Reddy : కాళేశ్వరంపై నిపుణుల కమిటీ.. నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష..

CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకెళ్లాలని అన్నారు. హడావిడి చేసి మరోసారి తప్పులకు తావివ్వద్దని ఇరిగేషన్ విభాగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. సాంకేతికంగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని తదుపరి మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై నిర్ణయం తీసుకోవాలన్నారు సీఎం రేవంత్‌.


గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులకు ఇప్పటికే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని సీఎం గుర్తు చేశారు. సుమారు లక్షన్నర కోట్లతో చేపట్టిన భారీ ప్రాజెక్టు రిపేర్లకు.. సుమారు ఎనిమిది నుంచి పది వేల కోట్లు అవసరమయ్యే అవకాశముందని.. అలాంటి పరిస్థితి వచ్చే ఖర్చుకు ఆలోచించాల్సింది లేదని స్పష్టత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర జల సంఘం(central water commission), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(National Dam Safety Authority) నిపుణులతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రెండు మూడు రోజుల్లోనే వీరందరితో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. తనతో పాటు ఇరిగేషన్ మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొంటామని సీఎం రేవంత్‌ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కుంగిన ఫిల్లర్లను రిపేర్లు చేయిస్తే సరిపోతుందాలేదా.. ఉన్నవి తొలిగించి కొత్తవి కట్టాలా కొన్నింటిని రిపేర్లు చేసి కొన్నింటిని కొత్తగా నిర్మిస్తే సరిపోతుందా అనేది ఈ కమిటీ తో సమగ్రంగా అధ్యయనం చేయిస్తామన్నారు.

కృష్ఱా జలాల్లో తెలంగాణ నీటి వాటాలు, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కృష్ణా జలాలకు సంబంధించి జరిగిన సమావేశాలు కేఆర్ఎంబీ ఎజెండాలు, చర్చల వివరాలు, మినిట్స్, నిర్ణయాలు, ఒప్పందాలన్నింటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. వీటన్నింటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దామని సీఎం అన్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల కృష్ణా జలాల వాటాలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారని సీఎం ప్రశ్నించారు. గతంలో ఏం చర్చలు జరిగాయి, ఏమేం నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నింటిపై అఖిల పక్ష సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనల్లో నిజమెంత.. అప్పుడు నిర్ణయాలు తీసుకున్నదెవరు.. వాటన్నింటినీ ప్రజల ముందు ఉంచాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగే సలహాలు సూచనలు తప్పకుండా ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు.

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్లు వస్తున్న ఆరోపణలపై సమావేశంలో చర్చించారు. ఏ ప్రాజెక్టు అప్పగించలేదని ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని అధికారులు సీఎంకు వివరణిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 45 రోజులైందని.. ఈ సమయంలోనే ఎప్పుడు కృష్ణా బోర్డుతో మీటింగ్‌లు జరిగాయి. ఎవరెవరు హాజరయ్యారు.. ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు..? తమకు తెలియకుండా అధికారులేమైనా నిర్ణయాలు తీసుకున్నారా..? మీమీ విభాగం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారంటూ ఇరిగేషన్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు పోతున్నాయి. కృష్ణా జలాల్లో ఎంత వాటా ఉందో వాళ్లకు తెలియదా అన్న రేవంత్‌రెడ్డి.. వాటాకు మించి నీటిని తోడుకుపోతుంటే పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో.. అఖిల పక్ష సమావేశంలో చర్చకు పెడదామన్నారు.

ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉందని.. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాధాన్యతలవారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులను ప్రశ్నించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. వీలైనంత త్వరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ టన్నెల్ పనులను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అన్నారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×