CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. 6 గ్యారంటీలను అమల్లోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీసేవల పరిధిని పెంచారు. ఈ రెండు గ్యారంటీలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి.
CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. 6 గ్యారంటీలను అమల్లోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ సేవల పరిధిని పెంచారు. ఈ రెండు గ్యారంటీలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి.
6 గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. ఈ క్రమంలోనే మిగతా 4 గ్యారంటీలను అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు రూ.లక్షతోపాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక తయారు చేశాలని నిర్దేశించారు.
మరోవైపు అభివృద్ధి పనులపైనా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.అలాగే విద్యారంగంపైనా దృష్టిపెట్టారు. లోక్సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టంచేశారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలం గుర్తించాలని నిర్దేశించారు. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.