Panyam Assembly Constituency : నంద్యాల జిల్లాలోని పాణ్యం నియోజకవర్గ రాజకీయాలు ఏపీ వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక్కడ సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ కాటసాని రాంభూపాల్ రెడ్డి హవా ఇప్పటికీ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య ద్విముఖపోరుకు మరోసారి పాణ్యం రెడీ అయింది. కాటసాని ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మరోసారి వైసీపీ నుంచి ఏడోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి పాణ్యం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.
2019 RESULTS
కాటసాని రాంభూపాల్ రెడ్డి VS గౌరు చరితా రెడ్డి
YCP 57%
TDP 36%
OTHERS 7%
గత ఎన్నికల్లో పాణ్యంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి 57 శాతం ఓట్ షేర్ సాధించి ఘన విజయం నమోదు చేసుకున్నారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన గౌరు చరితా రెడ్డి 36 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో పాణ్యం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
కాటసాని రాంభూపాల్ రెడ్డి (YCP)
కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్లస్ పాయింట్స్
కాటసాని రాంభూపాల్ రెడ్డి మైనస్ పాయింట్స్
గౌరు చరితా రెడ్డి (TDP)
గౌరు చరితా రెడ్డి మైనస్ పాయింట్స్
కుల సమీకరణాలు
ఎస్సీ 32%
ముస్లిం 21 %
యాదవ్ 12%
బోయ 7%
కాపు 6%
రెడ్డి 5%
పాణ్యంలో ఎస్సీ సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉంది. ఇందులో 55 శాతం మంది జగన్ పార్టీకి, 40 శాతం మంది టీడీపీకి, 5 శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. ముస్లింలలో 50 శాతం వైసీపీకి, 40 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఇక యాదవ్స్ లో 45 శాతం జగన్ పార్టీకి, 50 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామని సర్వేలో తమ అభిప్రాయంగా వెల్లడించారు. బోయల్లో 50 శాతం మంది ఫ్యాన్ గుర్తుకు, 45 శాతం మంది సైకిల్ గుర్తుకు, 5 శాతం మంది ఇతరులకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు. కాపుల్లో 50 శాతం జగన్ పార్టీకి, 45 శాతం టీడీపీకి,5 శాతం ఇతరులకు అండగా ఉంటామంటున్నారు. రెడ్లలో 60 శాతం వైసీపీకి, 35 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..
కాటసాని రాంభూపాల్ రెడ్డి VS గౌరు చరితా రెడ్డి
YCP 52%
TDP 43%
OTHERS 5%
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి 52 శాతం ఓట్లు సాధించి గెలిచే అవకాశం ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ ఎక్స్ క్లూజివ్ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డికి 43 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తేలింది. పాణ్యంలో జనం వైసీపీవైపు చూస్తుండడానికి కారణం సంక్షేమ పథకాల ప్రభావమే అని సర్వేలో తేలింది. అమ్మఒడి, జగనన్న చేయూత, జగనన్న విద్యాదీవెన, కాపు నేస్తం వంటివి ఇక్కడ పార్టీ గెలుపునకు ఉపయోగపడేలా కనిపిస్తున్నాయి. ఆరుసార్లు గెలిచిన కాటసాని పాజిటివ్ ఇమేజ్ కూడా బలంగా పని చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం కూడా వైసీపీ గెలిచేందుకు దోహదపడే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అయితే గౌరు చరితారెడ్డి ఇన్ ఫ్లూయెన్స్ కూడా పాణ్యంలో రోజురోజుకూ పెరుగుతోంది. అదనపు ఓట్లు రాబట్టడంలో ఈ ప్రభావం ఎంత వరకు ఉపయోగపడుతుందన్నది కీలకంగా మారుతోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎంత రాబడితే అంత ఓట్ షేర్ పెరిగే అవకాశాలైతే టీడీపీకి కనిపిస్తున్నాయి.
.
.