Rohit Sharma latest news(Sports news headlines):
2019 వరల్డ్ కప్ లో నేను 5 సెంచరీలు చేశాను. ఏం జరిగింది? టోర్నమెంటులో ఓడిపోయాం. ప్రపంచకప్ విజయం లేకుండా శతకాలు, రికార్డులు సాధించడం అర్థరహితమని అన్నాడు. అధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమాతో రోహిత్ శర్మ మాట్లాడాడు. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తన మనసులోని మాటలను నిర్భయంగా తెలిపాడు.
నేను కెప్టెన్ గా వచ్చిన తర్వాత.. ముందీ గణాంకాల పిచ్చిని వదలగొట్టాలని చూశాను. కొంత ప్రయత్నం చేశాను. గ్రౌండ్ లోకి వెళ్లిన తర్వాత స్వేచ్ఛగా ఆడాలి. రికార్డుల కోసం ఆడితే, మ్యాచ్ లో ఫీల్ తగ్గిపోతుందని అన్నాడు. నిజానికి ఎవరైనా సరే, రికార్డుల కోసం కాదు.. జట్టు విజయం కోసం ఆడాలని అన్నాడు. అదే నేర్పిద్దామని ఇన్నాళ్లూ ప్రయత్నించానని అన్నాడు.
ఇప్పుడు జనం ఎవరూ రికార్డులను పట్టించుకోవడం లేదని అన్నాడు. మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్నారని తెలిపాడు. నిజానికి మన దేశంలో క్రికెట్ అభిమానులు రికార్డుల గురించి ఎక్కువగానే మాట్లాడతారని అన్నాడు. కానీ ఇప్పుడు ప్రతీ పనికిమాలిన దానిని ఒక రికార్డుగా పరిగణిస్తున్నారు.వాటిని చూస్తుంటే మాకే నవ్వు వస్తోందని అన్నారు. రికార్డులను వేలంవెర్రిగా మార్చేశారని అన్నాడు.
మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నిర్వహించడం కొంచెం కష్టమేనని అన్నాడు. కానీ బాధ్యతలు వచ్చిన తర్వాత కష్టమైనా భరించాలని అన్నాడు. దేశం కోసం ఆడటాన్ని ఎప్పుడూ గౌరవంగా భావిస్తానని అన్నాడు. గత కొన్నేళ్లుగా కోర్ గ్రూప్లో భాగంగా ఉన్నాను. వైస్ కెప్టెన్గా కీలక నిర్ణయాల్లో భాగమయ్యాను. కోహ్లీ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్ల్లో సారథ్యం కూడా వహించానని తెలిపాడు. .
ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లను చూస్తూ పెరిగాను. ఇప్పుడు వారి సరసన నిలిచే అవకాశం దక్కడం గొప్ప విషయమేనని అన్నాడు. ఇంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా? అనే ఆశ్చర్యం వేస్తుందని అన్నాడు. మొత్తానికి ఇంటర్వ్యూల్లో రికార్డుల కోసం బుర్ర పీక్కోవద్దని మంచి సలహా ఇచ్చాడని నెట్టింట జనం కామెంట్లు చేస్తున్నారు.