స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. అదే క్రమంలో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చి అక్కడ కూడా ఓ రేంజ్లో రెస్పాన్స్ అందుకుంటున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ మూవీ వెండితెరపై తన స్టామినా ఏంటో చూపించింది.
సుమారు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నెల తిరగక ముందే జనవరి 20న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్లలో అందుబాటులోకి వచ్చి అక్కడ కూడా దుమ్ము దులిపేసింది. ఈ మేరకు ఓటీటీలో ‘సలార్’ గ్లోబల్ టాప్ 10లో నిలిచి బుల్లితెర మీద కూడా తన హవా కొనసాగించింది.
ఈ సినిమాతో పాటు రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ మూవీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చి అదరగొట్టేసింది. థియేటర్లలో సుమారు రూ.900 కోట్లు వసూళు చేసి బాక్సాఫీసు రికార్డులకెక్కిన ఈ సినిమా ఓటీటీలో తన రన్ టైంని పెంచుకుని టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతుంది. అలాగే గతేడాది ఫీల్గుడ్ మూవీగా పేరుతెచ్చుకున్న ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది.
ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు సీక్వెల్గా ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ టైటిల్తో తెరకెక్కిన ఈ మూవీ కూడా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంటుంది. పార్ట్ 1లో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ తమ నటనతో ప్రేక్షకులను కట్టి పడేసారనే చెప్పాలి.