Nandyal Assembly Constituency : ఆంధ్ర రాజకీయాల్లో నంద్యాల నియోజక వర్గ రాజకీయాలు ఎప్పటికప్పుడు ప్రత్యేకం. నంది ఆలయం అన్న పేరు మీదుగా నంద్యాల అన్న పేరు వాడకంలోకి వచ్చిందంటారు. ప్రఖ్యాత మహానంది ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది. విజయనగర సామ్రాజ్య కాలం నాటి నుంచి ఈ ప్రాంత రాజకీయాలు చాలా కీలకం. 1991 బై ఎలక్షన్లలో పీవీ నర్సింహారావు నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచారు. గత కొన్నేళ్లుగా నంద్యాల నియోజకవర్గం శిల్పా కుటుంబం, భూమా కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ గా మారిపోయింది. ప్రస్తత అధికార పక్షం, ప్రతిపక్షం ఈసారి ఎన్నికల్లో తగ్గేదేలేదంటూ పోటీ పోటీగా రంగంలోకి దిగుతున్నారు. మరి నంద్యాల నియోజకవర్గం ఓటరు నాడి ఈసారి ఎలా ఉండనుంది.. ఆ వివరాలు తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.
2019 RESULTS
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి VS భూమా బ్రహ్మానంద రెడ్డి
YCP 55%
TDP 38%
JSP 3
OTHERS 4%
2019 ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పోటీ చేసి 55 శాతం ఓట్లు రాబట్టి గెలిచారు. శిల్పా మోహన్ రెడ్డి అనారోగ్య సమస్యలతో తప్పుకుని తన కొడుకుని గత ఎన్నికల్లో నిలబెట్టి నంద్యాల నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నారు. ఇక్కడ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి 38 శాతం ఓట్లు మాత్రమే రాబట్టారు. జనసేనకు 3 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో నంద్యాల సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (YCP)
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్లస్ పాయింట్స్
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మైనస్ పాయింట్స్
భూమా బ్రహ్మానంద రెడ్డి (TDP)
భూమా బ్రహ్మానంద రెడ్డి ప్లస్ పాయింట్స్
భూమా బ్రహ్మానంద రెడ్డి మైనస్ పాయింట్స్
NMD ఫరూక్ (TDP)
NMD ఫరూక్ ప్లస్ పాయింట్స్
NMD ఫరూక్ మైనస్ పాయింట్స్
కుల సమీకరణాలు
ముస్లిం 25%
ఎస్సీ 20%
బలిజ 17%
రెడ్డి 10%
వైశ్య 8%
నంద్యాలలో ముస్లిం వర్గం జనాభా ఎక్కువగానే ఉంది. వీరిలో వైసీపీకి 50 శాతం, టీడీపీకి 50 శాతం మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. అటు ఎస్సీల్లో 50 శాతం జగన్ పార్టీగకి, 40 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. బలిజ సామాజికవర్గానికి చెందిన వారిలో 45 శాతం వైసీపీకి, 50 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామంటున్నారు. అటు రెడ్డి సామాజికవర్గంలో 60 శాతం వైసీపీకి, 40 శాతం టీడీపీకి సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఇక వైశ్యుల్లో 55 శాతం వైసీపీ, 40 శాతం టీడీపీ, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి VS భూమా బ్రహ్మానంద రెడ్డి
YCP 51%
TDP 42%
OTHERS 7%
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి 51 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉండగా, టీడీపీకి 42 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. ఇతరులు 7 శాతం ఓట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ సెగ్మెంట్ లో వర్గవిబేధాలు టీడీపీని దెబ్బ తీస్తున్నట్లుగా పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. వైసీపీ అభ్యర్థి అటు ప్రజలతో మమేకం అవడం, ఇటు క్యాడర్ తో మంచి సత్సంబంధాలు మెయింటేన్ చేస్తుండడంతో గెలుపు నల్లేరుపై నడకే అన్నది బిగ్ టీవీ సర్వేలో జన అభిప్రాయంగా తేలింది.
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి VS NMD ఫరూక్
YCP 52%
TDP 40%
OTHERS 8%
ఇక టీడీపీ నుంచి NMD ఫరూక్ బరిలో దిగితే పోల్ సినారియో ఎలా ఉందో చూద్దాం. వైసీపీకి 52 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉండగా, టీడీపీకి 40 శాతం ఓట్లు రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయి, ఇతరులు 8 శాతం ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. NMD ఫరూక్ సీనియర్ మోస్ట్ లీడరే అయినప్పటికీ, హైకమాండ్ మద్దతు ఉంటున్నా… భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం సపోర్ట్ లేకుండా సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేవన్నది గ్రౌండ్ లెవెల్ లో జనం అభిప్రాయంగా తేలింది.