Pawan Kalyan : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత వవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజోలు, రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు.
Pawan Kalyan : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత వవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజోలు, రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు.
ఎన్నికల్లో టీడీపీతో కలిసే జనసేన పోటీ చేస్తుందన్నారు. ఆ పార్టీతో కలిస్తే జనసేన పార్టీ మరింత బలపడుతుందన్నారు. ఉమ్మడిగానే మేనిఫెస్టో ఉంటుందని సృష్టం చేశారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుందన్నారు. తమ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై తనకు సృష్టమైన అవగాహన ఉందని తెలిపారు. సీఎం జగన్కి ఊరంతా శత్రువులే అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్పై తనకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదని తెలిపారు. వైసీసీ నేతలకు కష్టమొస్తే తన వద్దకు రావాలని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడుతున్నారన్నారు. 2024లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
అంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట, అరకు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.