EPAPER

Uttar Pradesh : ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Uttar Pradesh : ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టిన ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. షాజహాన్ పుర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారరణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.


ఈ ప్రమాదంపై అలగంజ్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జలలాబాద్ నుంచి ఒక ఆటో ప్రయాణికులతో వస్తోంది. అందులోని ప్రయాణికులంతా గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు బయల్దేరారు. ఆటోను.. ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తోన్న ఒక ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు. బరేలీ – ఫరూఖాబాద్ రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతులలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను సీఎం యోగి ఆదేశించారు.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×