Republic Day 2024 : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations)కు యావత్ దేశమంతా సిద్ధమవుతోంది. ప్రతి ఏటా జనవరి 26న జరుపుకునే ఈ వేడుకలు మొత్తంలో.. ఢిల్లీలో జరిగే వేడుకలు ప్రత్యేకం. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా ఢిల్లీలోని రక్షణశాఖ రంగ్ శాల మైదానానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ప్రత్యేక పారామిలిటరీ బలగాలు, రక్షణ విభాగానికి చెందిన సాయుధ దళాలు ప్రతి సంవత్సరం ప్రదర్శనలో భాగమవుతున్న విషయం తెలిసిందే. అయితే సుమారు మూడేళ్ల తర్వాత.. అంటే 2020 తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ శకటం రిపబ్లిక్ డే వేడుకల్లో కనిపించబోతోంది.
దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి చొరవ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 27న ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలంగాణ సంక్షోభం గురించి చర్చించినట్లు సమాచారం. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో “ప్రజాస్వామ్య మట్టి పరమాళాలు – జనసనం ప్రజాస్వామ్య యోధులు” అనే థీమ్ తో తెలంగాణ శకటం సిద్ధమవుతోంది. ఈ శకటానికి జయజయహే తెలంగాణ అని నామకరణం చేశారు.
ప్రజాకవి అందెశ్రీ రచించిన ఈ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ప్రాచుర్యం పొందదింది. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీమ్, బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించిన రాంజీ గోండు, వీర వనిత చాకలి ఈతమ్మ విగ్రహాలను శకటంలో ప్రదర్శించనున్నారు. మలిదశ ఉద్యమ త్యాగాలను స్మరించుకునేలా తెలంగాణ శకటం రూపుదిద్దుకుంటోంది.